RTC ఉద్యోగులకు జగన్‌ గుడ్ న్యూస్

APSRTC ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. జనవరి నుంచి జీతాలతోపాటూ అలవెన్సులను కూడా కలిపి చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. అలవెన్సులు ఆలస్యంగా చెల్లిస్తున్న అంశం సమస్యగా మారుతోందని గుర్తించింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా… ఇకపై జీతంతో పాటే ఇవ్వనుంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులు అసంతృప్తితో ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్న సీఎం జగన్.. ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.