తెలంగాణ రైతులకు తీపి కబురు : నేటి నుండి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ

రాష్ట్రంలోని రైతులకు కేసీఆర్ తీపి కబురు తెలిపారు. నేటి నుండి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయబోతున్నారు. ఎప్పటిలాగానే ఈ సీజన్‌లోనూ తొలుత ఎకరం రైతులకు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు.

ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాలకుగానూ 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నుట్టు వెల్లడించారు. గతంతో పోల్చితే ఈ సీజన్‌లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా అందిస్తున్నట్టు వివరించారు. అలాగే 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు ఇవ్వనున్నారు. గతంతో పోల్చితే ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడేది.. ఈ సీజన్‌తో కలిపితే రైతుబంధు ద్వారా రూ.72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు అవుతుంది.