ప్రయాణికులు గమనించగలరు..నేడు సికింద్రాబాద్‌ నుంచి పలు రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులు తప్పక గమనించాల్సిన వార్త. భద్రతాపరమైన పనుల కారణంగా ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఈ రోజు (సోమవారం) పలు రైళ్ల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఖరగ్‌పూర్‌-భద్రక్‌ సెక్షన్‌లో బహనగా బజార్‌స్టేషన్‌ వద్ద ట్రాక్‌ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. దీంతో సుమారు 10 రైళ్ల సర్వీసులను రైల్వే విభాగం అధికారులు రద్దు చేశారు.

రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సంత్రాగచ్చి-తాంబరం (22841)
సికింద్రాబాద్‌-డిబ్రూగఢ్‌ (07046)
సికింద్రాబాద్‌-అగర్తలా (07030)
షాలిమార్‌-హైదరాబాద్‌ (18045)
హైదరాబాద్‌-షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌
తిరుపతి-సంత్రాగచ్చి (22856)
ఎర్నాకుళం-హావ్‌డా (22878)
హావ్‌డా-ఎస్‌ఎంవీ బెంగళూరు (22863)
ఎస్‌ఎంవీ బెంగళూరు-హావ్‌డా (22864)
అగర్తలా-ఎస్‌ఎంవీ బెంగళూరు (00636)