కరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు

nia-raids-in-karimnagar

కరీంనగర్​ ః కరీంనగర్‌ పట్టణంలో ఎన్‌ఐఏ (ఎన్​ఐఏ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. అనుమానితుని కోసం ఎన్​ఐఏ అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం.. ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది.

కరీంనగర్ హుస్సేనీపురకు చెందిన తబరేజ్ కు గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉపాధి పొందతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్​ఐఏ అధికారుల బృందం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కరీంనగర్ కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారు జామునే కరీంనగర్ చేరుకున్న టీమ్ ఎన్‌ఐఏ డీఎస్పీ రాజేష్ ఆధ్వర్యంలో.. అనుమానిత వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. అధికారులు తనిఖీలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.