రాజమండ్రిలో ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుక..?

మెగా ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ BRO మూవీ రిలీజ్ కు దగ్గరపడింది. దీంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘BRO’ . తమిళ చిత్రం వినోదయ సీతమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా నటిస్తున్నారు.

జులై 28న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక రాజమండ్రిలో జరగనుందని టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చేస్తోన్న వారాహి యాత్ర అటు వైపే ఉండటంతో అక్కడే ఈ ఈవెంట్ ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారట.

ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రోహిణి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ కామెడీ-డ్రామాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.