పేదరిక నిర్మూలనకే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం
నేడు ఇందిరాగాంధీ జయంతి
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, 1996 నుండి 1977వరకు వరుసగా మూడు పర్యా యాలు, మళ్లీ 1980లో ప్రధాన మంత్రిగా పనిచేసి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పిలువబడిన ప్రజా నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ.
1917నవంబర్ 19న జన్మించిన ఇందిరాగాంధీ భారత తొలి ప్రధాని జవహార్లాల్నెహ్రూ ఏకైక కుమార్తె. అసలు పేరు ఇందిరా ప్రియదర్శినిగాంధీ.
జవహర్లాల్నెహ్రూ, కమలా నెహ్రూల ఏకైక సంతానం. ఆమె ఉత్తరప్రదేశ్లోని అలహాబాదులో ఆనంద్ భవన్లో జన్మించింది.
తన తాత మోతిలాల్నెహ్రూ అల హాబాద్లో పేరొందిన న్యాయవాది. ఇందిరాగాంధీ పుట్టేసరికి భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉండేది.
దేశం ఆర్థికంగా, సామాజికంగా అల్లకల్లోలంగా ఉండేది. ఇందిరాగాంధీ అలహా బాదులో ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం పూణె విశ్వవిద్యా లయం నుండి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో చేరి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. జాతీయోద్యమంలో భాగంగా జవహార్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ తరచుగా జైలుకు వెళ్లడం వల్ల తన తల్లి కమలానెహ్రూ ఆరోగ్యం క్షీణించింది.
చికిత్స నిమిత్తం వెళ్లిన తర్వాత అక్కడే తల్లికి తోడుగా ఉంటూ ఒక స్కూళ్లో చేరింది. ఎంత చికిత్స చేసినా తల్లి ఆరోగ్యం కుదుటపడకపోవడం వల్ల తన 17వ యేటనే కమలా నెహ్రూ మరణించడంతో ఇందిరా గాంధీ ఒంటరైంది.
తల్లి మరణం తర్వాత ఒంటరిగా ఉన్న ఇందిరకు నెహ్రూ మనోధైర్యాన్ని ఇస్తూ నాయకత్వ లక్షణాలు నూరిపోసే వారు.పై చదువుల నిమిత్తం ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యా లయంలో చేర్పించారు.
ఆమె చదువుతున్న రోజుల్లో జర్నలిస్టు అయిన ఫిరోజ్గాంధీతో పరిచయం ఏర్పడి వివాహానికి దారి తీసింది. కానీ వారిద్దరి వివాహానికి నెహ్రూ ఇష్టపడలేదు.
చివరగా మహాత్మాగాంధీ సలహా మేరకు 1942లో ఇందిర, ఫిరోజ్ గాంధీల వివాహం జరిగింది.
స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో ఇందిరా గాంధీ దేశచరిత్ర, ప్రపంచచరిత్ర గురించి తన తండ్రికి ఉత్తరాలు రాస్తూ దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలియచేసేది.
స్వాతం త్య్ర పోరాటంలో సైతం పాల్గొంటూ తండ్రికి తగ్గ కూతురుగా ఉద్యమంలో ధైర్యంగా పాల్గొనేది.
1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్య మంలో పాల్గొనడం వల్ల పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలులో ఉండగానే మగ పిల్లవాడికి జన్మనిచ్చింది.
1943 మే 13న విడుదలైంది.ఇందిరాగాంధీ ఎన్నో సంవత్సరాల పాటు నెహ్రూ వెనుకనే ఉంటూ అనుకోకుండా రాజకీయరంగ ప్రవేశం చేసింది.
ఆమె సేవలకు గుర్తింపుగా 1959లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైంది.
ఆ తర్వాత జరిగిన పరి ణామంలో నెహ్రూ మరణాంతరం, లాల్ బహదూర్శాస్త్రి మంత్రి వర్గంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో పనిచేసి అందరి మన్న నలుపొందారు.
తర్వా త 1962 జనవరి 24న మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్పార్టీ ప్రకటించింది.
మొదటిమహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె రికార్డ్స్సృష్టించింది.ప్రపంచ నేతలతో మంచిగుర్తింపుపొందుతూ, అందరి దృష్టిని ఆకర్షించేది.
సిక్కుల కోరిక మేరకు హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంకు, పశ్చిమ దేశాల సహకారంతో దేశ ఆర్థికవ్యవస్థను చక్కదిద్దినది.
కొందరు నేతలు రెండోసారి ప్రధానిగా ఒప్పుకోని సమయంలో ‘గరీబీ హటావో’ నినాదంతో నలభైమూడు రోజులపాటు దేశమంతటా పర్యటిస్తూ 300 సభలు, 36వేల మైళ్లు పర్యటన చేసి ప్రజల దృష్టిలో గొప్ప నాయకురాలిగా పేరు సంపాదించుకుంది.
ఆమె పరిపాలన కాలంలో రైల్వే కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేసినప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ ఉద్యోగాలు తొలగించి నప్పుడు వారి ఆగ్రహానికి గురికావడం, వారు కోర్టు ద్వారా మళ్లీ ఉద్యోగాలు పొందారు.
ఆ తర్వాత ఎన్నికల్లో ఓటుద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని ఓడించారు.అందుకే కార్మికులు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడలేవని అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చును.
అలాగే 1971లో ఆమేథి లోక్సభ నియోజకవర్గం నుండి రాజ్ నారాయణపై గెలిచిన సందర్భంలో ఇందిరాగాంధీ ఎన్నికచెల్లదని ప్రతిపక్షాలుకోర్టు లో సవాల్ చేసిన క్రమంలో 1975లో అలహాబాద్ కోర్టు ఆమె ఎన్నిక చెల్లదని ఆరు సంవత్సరాలు పాటు ఎన్నికల్లో పాల్గొనరాదని కోర్టు తీర్పునిచ్చింది.
కానీ దానిపై స్టే ఆర్డర్ తెచ్చుకుంది. కానీప్రతిపక్షా లు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెద్దర్యాలీ నిర్వహించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు.
అప్పుడు రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారం1975జూన్ 25న రాష్ట్రపతి ఎమర్జెన్సీవిధించారు.
భారతదేశంలో పంచవర్ష ప్రణాళి కలతో దేశాన్ని అభివృద్ధి చేయాలని తమ తండ్రి ఆకాంక్ష మేరకు పేదరిక నిర్మూలనకోసం 20సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కపెట్టారు.
రాజకీయాల్లో ఆమెకు కుమారులు రాజీవ్ గాంధీ, సంజ§్ుగాంధీలు అండగా నిలిచారు.
పథకాల ద్వారా ప్రజాసంక్షేమం కోసం ప్రణా ళికలు రూపొందించుకుని దేశ ప్రజల కోసం స్వపరిపాలన అందిం చిన గొప్పనేత.ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమెను 1984 అక్టోబరు 31న ఆమె అంగరక్షకులే ఇందిరాగాంధీని కాల్చి చంపారు.
- సామంతుల సదానందం
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/