అన్ని వేరియంట్లకూ ఒకే టీకా..అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు

‘అభిఎస్‌సీవో వ్యాక్’ అని పేరు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్లకు ఇక ఒకే ఒక్క టీకాతో చెక్ చెప్పొచ్చు. ఈ మేరకు సరికొత్త టీకాను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి ఈ టీకాకు ‘అభిఎస్‌సీవో వ్యాక్’ అని పేరు పెట్టారు.

ఇది పెప్టైడ్ వ్యాక్సిన్. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు రకాల వైరస్‌లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కరోనాలోని అన్ని వైరస్‌లపైనా పనిచేసే ఏకైక టీకా ప్రపంచంలో ఇదొక్కటేనని శాస్త్రవేత్తలు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/