నేడు ముచ్చింతల్‌కు రానున్నసీఎం జగన్

చినజీయర్ స్వామి నిర్వహిస్తున్న శ్రీ రామానుజులు సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న జగన్

అమరావతి : సీఎం జగన్ నేడు హైదరాబాదుకు వస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజులు సహస్రాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం 3.50 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాదుకు బయల్దేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముచ్చింతల్ లోని త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్లి సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు ఆయన అక్కడే ఉంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు. రాత్రి 9.05 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

2016 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఆశ్రమాన్ని సందర్శించారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/