అధికారక లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన ప్రధాని

ముంబయి : కరోనాబారిన పడి, చికిత్స పొందుతూ కన్నుమూసిన గానకోకిల, లెజండరీ సింగర్​, భారతరత్న అవార్డు గ్రహీత అయిన లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ముంబయిలోని పెద్దర్ రోడ్ నివాసం అయిన ప్రభు కుంజ్ నుండి శివాజీ పార్క్ కు తీసుకువెళ్లారు, అక్కడ లతాజీ అంత్యక్రియలు నిన్న సాయంత్రం అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

కాగా, ముంబయిలోని శివాజీ పార్క్ లో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆమె భౌతికకాయానికి పరిక్రమ [పూజతో చుట్టూ ప్రదక్షిణలు] నిర్వహించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ సోదరి, గాయని ఆశా భోంస్లే, ఆమె కుటుంబ సభ్యులకు ప్రధాని తన సంతాపాన్ని తెలిపారు. వేదిక వద్ద ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేలను కూడా ప్రధాని మోడీ కలిశారు. లతా మంగేష్కర్‌కు నివాళిగా యావత్​ దేశం రెండు రోజుల పాటు సంతాప దినాలు పాటించనుంది. రెండు రోజుల పాటు జాతీయ జెండా సగం వరకు ఎగరేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/