దేశంలో కొత్తగా 10 వేల కరోనా కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పదులు , వందల నుండి వేల సంఖ్యకు చేరాయి. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా పదివేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 10 వేల 158 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 45 వేలకు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఎనిమిది నెలల్లో ఈ స్థాయిలో కొత్త కేసులు రావటం ఇదే మొదటిసారి. ఎక్స్బీబీ1.16 అనే వేరియంట్ కారణంగా భారత్లో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆసుపత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్టు చెబుతున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో కొత్త కేసులు సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.