ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన సిఎం
న్యూఢిల్లీ: సిఎం కేజ్రీవాల్ గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోనే మొట్టమొదటిది అయిన ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా బారినపడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ప్రజలను కోరారు. పాస్మా దానం చేయాలనుకునే వారు 1031 నంబర్కు ఫోన్కాల్ ద్వారాగానీ, 8800007722 నంబర్ వాట్సాప్ మెసేజ్ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని కేజ్రవాల్ సూచించారు. ప్లాస్మా దానం చేయాలనుకునే వారు పైన పేర్కొన్న 1031కుగానీ, వాట్సాప్ నంబర్కుగానీ సమాచారం ఇస్తే.. డాక్టర్లు మిమ్మల్ని సంప్రతించి మీ అర్హతకు సంబంధించి తుదుపరి ధృవీకరణ చేస్తారని అరవింద్ కేజ్రివాల్ చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/