నాగాలాండ్, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్
న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున స్థానాలున్నప్పటికీ 59 సీట్లకే ఎన్నికలు జరుగుతున్నాయి. మేఘాలయలో సోహియాంగ్లో నియోజకవర్గ యూడీపీ అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదాపడింది. ఇక నాగాలాండ్లోని అకులుటో స్థానంలో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఉన్నారు.
మేఘాలయాలో ఎన్నికలు జరుగుతున్న 59 స్థానాల్లో 369 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం అధికారులు 3419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా అధికార ఎన్పీపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యే ఇక్కడ పోటీ నెలకొన్నది.
మరోవైపు నాగాలాండ్లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 13 లక్షల మంది ఓట్లు వేయనున్నారు. ఇక్కడ అధికార ఎన్డీపీపీ, బిజెపి పొత్తుపెట్టుకోగా, కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూ, ఎన్పీపీలు వాటికి పోటీనిస్తున్నాయి.