జమ్ముకశ్మీర్లో భారీగా పట్టుబడిన పేలుడు పదార్థాలు
శ్రీనగర్ః జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. స్వాతంత్య్ర దినోత్వ వేడుకలు సమీపిస్తున్న వేళ పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలను భద్రతా పట్టుకున్నాయి. తహబ్ క్రాసింగ్ సమీపంలో 25 నుంచి 30 కిలోల బరువున్న ఐఈడీ (మందుపాతర)ని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్మానుష్య ప్రదేశంలో అధికారులు పేల్చివేశారు.
కాగా, పుల్వామా పోలీసులు అందించిన విశ్వనీయ సమాచారం మేరకు తహబ్ క్రాసింగ్ వద్ద తనిఖీలు నిర్వహించామని.. ఈక్రమంలో సుమారు 30 కిలోల పేలుడు పదార్థాలు లభించాయని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/