ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పిన డీకే అరుణ

ఈ నెలలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని డీకే అరుణ స్పష్టం చేసారు. గద్వాల నియోజకవర్గంలో నా స్థానంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. బిజెపి పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు సాగుతోందని, అందుకే తన స్థానంలో బీసీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అరుణ తెలిపారు.

గద్వాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను తమ పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానన్నారు. కాగా, ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అరుణ కూడా ఆ లిస్ట్ లో చేరింది.