బిజెపి లో చేరిన మునుగోడు చలమల కృష్ణారెడ్డి

కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మునుగోడు కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి..ఆ పార్టీ కి రాజీనామా చేసి ఈరోజు బిజెపి లో చేరారు.కేంద్రమంత్రి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చలమల భావించారు.

కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో తీవ్ర మస్తాపానికి గురై..నేడు బిజెపి లో చేరారు. చలమల కృష్ణారెడ్డితో పాటు బోథ్ టిక్కెట్ ఆశిస్తున్న రాథోడ్ బాపురావు, ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న సుభాష్ కూడా బీజేపీలో చేరారు. అయితే చలమల కృష్ణారెడ్డి కి మునుగోడు బిజెపి టికెట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.