అన్నారం బ్యారేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదు – ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్

అన్నారం బ్యారేజిపై మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై బ్యారేజి ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ ఏ. యాదగిరి స్పందించారు. అన్నారం బ్యారేజీపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని , పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ప్రతి సంవత్సరం సహజంగా ఓ అండ్ ఎం టెక్ అప్ చేస్తామని, 1275 మీటర్ల పోడవులో రెండు చోట్ల సీపేజ్ ఉందని కానీ, ఎక్కడ కూడా ఇసుక రావడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ, ఆఫ్కాన్స్ సంస్థల మధ్య ఒప్పందం ఉంటుందని, బ్యారేజీ నిర్వహణ బాధ్యత ఆఫ్కాన్స్ సంస్థదేనని ఆయన తెలిపారు. సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు కంకర, ఇసుక, ఫిల్టర్ మీడియా వేస్తున్నామని, ఇసుకతోని రింగ్ బండ్ కూడా వేస్తున్నామన్నారు. ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ నిర్వహణ ఉంటుందని, ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపెజ్ వాటర్ పంపేందుకు డిజైన్ లోనే ఏర్పాటు ఉంటుదని, అవసరం అయితే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అంతే తప్ప బ్యారేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని..కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేసారు.