హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు

Metro train Speed hike
Metro train Speed hike

హైదరాబాద్ మెట్రో టైమింగ్ లో మార్పులు చేసారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ (నుమాయుష్) పూర్తి కావడంతో మెట్రో రైలు వేళలు గురువారం నుంచి మారాయి. రాత్రి 12 గంటలు కాకుండా గతంలో నడిచినట్లే రాత్రి 11 గంటలకే చివరి ట్రిప్ రైళ్లు బయలుదేరనుంది. టర్మినల్‌ స్టేషన్లైన ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం, జేబీఎస్‌ నుంచి చివరి మెట్రో రైళ్లు వెళ్తాయి. రాత్రి 12 గంటల వరకు గమ్యస్థానానికి చేరుకుంటాయి.

నాంపల్లిలో నుమాయిష్ సందర్భంగా.. మెట్రో ట్రైన్ సేవలను మరో గంట పొడిగిస్తున్నట్లు గతంలో అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నుమాయిష్ పూర్తయ్యే వరకు అర్థరాత్రి 12 గంటల దాక మెట్రో రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్బీ నగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో ఈ పెంచిన పని వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు. దాపు 46 రోజుల పాటు మెట్రో రైళ్లు 12 గంటల దాక నడిచాయి. ఇక ఇప్పుడు ఎగ్జిబిషన్‌ పూర్తి కావడం తో పాత టైమింగ్స్ నే అమల్లోకి తెచ్చారు. ఈ 46 రోజులు ఎగ్జిబిషన్‌కు వెళ్లేందుకు 11 లక్షల మంది ప్రయాణికులు మెట్రో వినియోగించుకున్నారని మెట్రో వర్గాలు తెలిపాయి.