జాతి యావత్తూ మీ వెనుకే..ప్రధాని

సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైన్యం

pm modi

న్యూఢిల్లీ: నేటి నుండి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌ వద్ద ప్రధాని మోడి మీడియాతో మాట్లాడుతూ..’మన పార్లమెంట్ సభ్యులంతా సైనికులకు ఓ సందేశాన్ని పంపాలి. జాతి యావత్తూ మీ వెనుకే ఉందని వారికి తెలియాలి. ఎంతో ధైర్యంతో వారంతా మాతృభూమిని కాపాడేందుకు ముందు నిలబడివున్నారు. ఎంతో విపత్కర వాతావరణ పరిస్థితుల్లో, క్లిష్టమైన ప్రాంతాల్లో వారున్నారు. ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడింది. ముక్తకంఠంతో ఈ సమావేశాలు వారికి అండగా నిలుస్తాయని భావిస్తున్నాను’ అని మోడి వ్యాఖ్యానించారు.

ఈ సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయని అభివర్ణించిన నరేంద్ర మోడి, వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైరస్ ప్రొటోకాల్ లో ముఖ్యమైన మాస్క్, భౌతిక దూరం తప్పనిసరని, అది సాధారణ ప్రజలైనా, పార్లమెంట్ సభ్యులైనా పాటించాల్సిందేనని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/