మున్సిపల్ కార్మికుల సమ్మె కు టీడీపీ పూర్తిమద్దతు – నారా లోకేష్

nara-lokesh

ఏపీలో వరుసగా పలు కార్మికులు నిరసన బాట చేపట్టారు. పాదయాత్ర లో , ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిన జగన్..అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేశారని..తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం జగన్ పట్టించుకోవడం లేదంటూ అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ ఫైకి నిరసన బాట చేపట్టారు. వీరి నిరసనకు టిడిపి మద్దతు తెలిపింది.

ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ తన పాదయాత్రలో ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని లోకేష్ విమర్శించారు. ‘‘అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తిమద్దతు ఇస్తుంది. అంగన్వాడీ సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతునిచ్చాయి. మున్సిపల్, ఆశా వర్కర్లు కూడా వారికి మద్దతు తెలిపాలి’’ అని లోకేశ్ పేర్కొన్నారు.