దేశంలో కొత్తగా 5,108 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 45,749
న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4 వేల మందికి కరోనా సోకగా, నేడు ఆ సంఖ్య 5,108కి చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి పెరిగింది. ఇందులో 4,39,36,092 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,216 మంది మరణించగా, 45,749 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 31 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.44 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 215.67 కోట్లకు చేరిందని పేర్కొన్నది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/