కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. రూ.46 లక్షల ఖరీదైన డైమండ్ నెక్లెస్ దొంగలు ఎత్తుకెళ్లారు. కేవీపీ భార్య సునీత మే 11న ఓ వివాహ వేడుకకు ఈ నెక్లెస్ వేసుకుని వెళ్లొచ్చారు. ఆ తర్వాత నుంచే నెక్లెస్ కనిపించడం లేదంటూ రెండు రోజుల కిందట బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ సునీత ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/