కొమరంభీం జిల్లాలో విషాదం..గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా అందరికి గుండెపోటు అనేది వస్తుంది. అప్పటివరకు అందరితో హ్యాపీగా ఉన్న వ్యక్తులు..సడెన్ గా గుండెనొప్పితో కుప్పకూలిపోయి మరణిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆలా మరణించగా..తాజాగా కొమరంభీం జిల్లాలో విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన కాగజ్నగర్ మండలం ఈస్గాలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్కు చెందిన దయానంద్ కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం డ్యూటీలో ఉన్న అతడికి సడెన్గా ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని తోటి సిబ్బందికి చెప్పాడు. నొప్పితో బాధపడుతున్న అతడిని తోటి సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దయానంద్ మరణించిన వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే దయానంద్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.