నేడు మంగళగిరి లో ‘నారీ సంకల్ప దీక్ష’
మంగళగిరి పార్టీ కార్యాలయం లో ఏర్పాట్లు
Amaravati: తెలుగుదేశం పార్టీ మహిళ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘నారీ సంకల్ప దీక్ష’ నిర్వహిస్తున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మహిళలు హాజరుకానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశ చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారని , మహిళలపై అత్యాచారాలు, పోలీసుల వైఫల్యాలను నిరసిస్తూ దీక్షను చేపడుతున్నట్లు అనిత తెలిపారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/