కేసీఆర్ కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్

తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనచ్చని , ఏపీతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, అందుకే భూముల ధరలు కూడా పెరుగుతున్నాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ఫై వైస్సార్సీపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కేసీఆర్ కామెంట్స్ ఫై స్పందించగా..తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

ఏపీలో భూముల ధరలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. అయితే విశాఖపట్నంలో కూడా ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాజధాని హైదరాబాద్ కాకుండా బయటికి వెళితే ధర ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. తద్వారా హైదరాబాద్ తో పోల్చుకోవాలంటే వైజాగ్ ఉందని గుర్తుచేశారు.