నితేశ్ కుమారే బీహార్ సిఎం..బిజెపి
సిఎంగా నితీశే ఉంటారన్న సుశీల్ కుమార్ మోడి
పట్నా: నితీశ్ కుమారే బీహార్ తదుపరి సిఎం అని బిజెపి ప్రకటించింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన అనంతరం బిజెపి నేత, బీహార్ డిప్యూటీ సిఎం సుశీల్ కుమార్ మోడి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘నితీశ్ కుమార్ సిఎంగా కొనసాగుతారు. ఇది మేమిచ్చిన మాట. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు’ అని ఆయన అన్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో 243 సీట్లకు బిజెపి 74 సీట్లలో గెలవగా, నితీశ్ నేతృత్వంలోని జేడీయూ 43 సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఇతర ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించిన నేపథ్యంలో, సిఎంగా మరొకరి పేరును బిజెపి తెరపైకి తేనుందని వార్తలు వస్తుండగా, బిజెపి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ‘కొంతమంది అధిక సీట్లను గెలుస్తారు. కొంతమంది తక్కువ సీట్లను గెలుస్తారు. అయితే, బీహార్ లో మేము సమాన భాగస్వాములం’ అని సుశీల్ కుమార్ మోడి వ్యాఖ్యానించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/