ఏపీ గవర్నర్ ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సోమవారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాజ్ భవన్ లో సుమారు గంట సేపు ఇరువురు సమావేశమయ్యారు. ఈ భేటీలో పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు, తాజా పరిణామాలపై పవన్ కల్యాణ్ గవర్నర్ తో చర్చించారు.

కాగా, రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పవన్ కల్యాణ్ తొలిసారిగా వారాహి వాహనం ఎక్కి ఈ సభకు విచ్చేయనున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ సభ ద్వారా పవన్ తన కార్యాచరణ ప్రకటిస్తారని అంత భావిస్తున్నారు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. వరుస బీసీ సామాజివర్గం కార్యకర్తలతో పాటు కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈరోజు కూడా పవన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. రేపు జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి కూడా నేతలతో చర్చించనున్నారు.