హైదరాబాద్ చివరి నిజాం మనవడు మృతి

హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు షహమత్ ఝూ(70) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..చికిత్స తీసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి ఆరోగ్యం మరింత విషమంగా మారడం తో కన్నుమూశారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మోజం ఝాకు రెండవ భార్య అన్వరీ బేగం కుమారుడే ఈ షహమత్ ఝా.

ఈయన ఇద్దరిని వివాహం చేసుకోవగా వారి నుంచి విడిపోయిన షహమత్ ఝా ఒంటరిగానే జీవించారు. అతనికి ఎలాంటి సంతానం లేదు. రెడ్‌హిల్స్‌లోని తన ఇంటిని విక్రయించిన తర్వాత బంజారాహిల్స్‌లోని తన సోదరి ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అతను షాజీ అనే పెనుపేరుతో ఉర్దూలో కవిత్వం రాశాడు. నిజాం తన పేరు మీదుగా మోజమ్ జాహీ మార్కెట్ అని పేరు పెట్టాడు.

ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో మేనల్లుడు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం మృతి చెందారు. షహమత్ ఝూ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈరోజు కోఠిలోని మస్జిద్-ఎ-జూడి ప్రాంతంలో తాత సమాధి పక్కనే షహమత్ ఝూ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.