కరీంనగర్ పట్టణంలో చిన్నారి మిస్సింగ్ కలకలం

కరీంనగర్ పట్టణంలో చిన్నారి కనిపించకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఉపాధికోసం మధ్యప్రదేశ్ నుండి కరీంనగర్ నగరానికి వచ్చిన యస్వంత కార్వే సబితా కార్వే దంప‌తులకు కృతిక(3) అనే చిన్నారి ఉంది. వీరు పట్టణంలోని శ్రీ హరి నగర్ కాలనీ లో నివాసం ఉంటున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడం తో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికి పాప మిస్ అయ్యి మూడు రోజులు కావొస్తుంది వారు వాపోతున్నారు.

చిన్నారి కృతిక కనిపించక పోవడంతో కరీంనగర్ టూటౌన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. భారీ వర్షాలు కురవడం తో పాప మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు చుట్టుపక్కల నాలలో వేదికారు. సిసి ఫుటేజీలో పాప కొంచెం దూరం నడుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తుంది. పాపను ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.