మహబూబాబాద్ జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది

ఇటీవల వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశా లో జరిగిన రైలు ప్రమాద ఘటన లో దాదాపు 270 మంది చనిపోయి..ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. ఈ ప్రమాద ఘటన తర్వాత కూడా ఒడిశాలో పలు ప్రమాదాలు జరిగాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో గూడ్స్‌ రైలు లింకు తెగిపోయింది. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

విజయవాడ వైపు నుంచి కాజీపేట వైపు వెళ్లే గూడ్స్ రైలు బోగీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ శివారులో విడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన గార్డ్… గూడ్స్ రైలు డ్రైవర్‌కు సమాచారం అందించారు. డ్రైవర్ వెంటనే గూడ్స్ రైలును నిలిపివేసి వెనుకకు వచ్చి విడిపోయిన గూడ్స్ బోగీలను తగిలించుకొని వెళ్లిపోయాడు. గార్డు అప్రమత్తంగా ఉండటం… విడిపోయిన గూడ్స్ బోగీలు పట్టాలు తప్పకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది.