టీడీపీ నేతలను చంద్రబాబు రోడ్డుపై వదిలేశారు : తిక్కారెడ్డి
2024 ఎన్నికలొస్తే అందరూ దివాళా తీస్తారు
అమరావతిః టిడిపి సీనియర్ నేత తిక్కిరెడ్డి చేసిని కీలక వ్యాక్యలు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల తర్వాత టిడిపి నేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను రోడ్డుపై వదిలేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ఉన్న డబ్బునంతా రాజకీయాలకే ఖర్చు చేశానని… 2024 ఎన్నికలు వస్తే తన ఆస్తి మొత్తం కరిగిపోతుందని… ఆ తర్వాత తాను టీకొట్టు పెట్టుకుని బతకాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో అందరు టీడీపీ నేతలు ఆస్తులు అమ్ముకున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు వస్తే అందరూ దివాళా తీస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు.
ఇదే సమయంలో తనపై గెలిచిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడి గదిలో దేవుడి ఫొటోలను తీసేసి జగన్ ఫొటోలను పెట్టుకున్నారని విమర్శించారు. అక్రమంగా ఇసుక అమ్ముకుంటూ బస్తాలు బస్తాలు డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకు వైఎస్ఆర్సిపి అధిష్ఠానం భారీగా డబ్బులు ఇస్తుందని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/