వారసుడు నుండి ఎమోషనల్ సాంగ్ రిలీజ్

విజయ్ నటిస్తున్న వారసుడు నుండి చిత్ర పాడిన ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తమిళ్ లో (వరిసు) పేరుతో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్నారు. తమిళం లో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు..తెలుగు మాత్రం కాస్త తక్కువగానే చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుండి ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ‘అమ్మమ్మ నేనేమి వింటినమ్మా .. వాకిళ్ల నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా .. అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా’ అంటూ సాగే ఈ పాట తల్లీకొడుకుల అనుబంధానికి అద్దం పట్టే విధంగా ఉంది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా చిత్ర ఆలపించారు. థమన్ మ్యూజిక్ అందించారు.

YouTube video