ఏపీలో రావణాసుర చిత్రానికి గుడ్ న్యూస్..

మాస్ రాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఏప్రిల్ 07 న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాల సక్సెస్ తర్వాత రవితేజ నుండి వస్తున్న సినిమా కావడం తో అభిమానుల్లో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె ఈ చిత్రానికి ఏపీసర్కార్ గుడ్ న్యూస్ తెలిపినట్లు వినికిడి.

రావణాసుర ఎర్లీ మార్నింగ్ షో స్ కి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంపిక చేసిన థియేటర్స్ లో సినిమా ప్రత్యేక షో ను ప్రదర్శించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ నటించారు. వారి పాత్రలు ఏంటి.. ఎందుకు అంత మంది హీరోయిన్స్ నటించారు అనేది ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా రవితేజ పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉండబోతుందని అంటున్నారు. మరి అవని తెలుసుకోవాలంటే ఏప్రిల్ 07 వరకు ఆగాల్సిందే. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు బీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ లో అభిషేక్ నామ నిర్మించారు.