మందులే కాదు మంచి ఆహారం ముఖ్యమే!

Eating Food

ఆసుపత్రిలో చేరిన వారికి మందులు మాత్రమే కాదు, తిండీ ముఖ్యమే. అది ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఉన్నదైతే ఇంకా మంచిదని తాజా అధ్యయనం..

చికిత్స ఫలితాలు మెరుగుపడటానికి, జబ్బుల దుష్ప్రభావాలు తగ్గటానికి, త్వరగా కోలుకోవటానికి దోహం చేస్తుంది. ఏదైనా కారణంతో ఆసుపత్రిలో చేరినప్పుడు తినడానికి, తాగడానికి ఇబ్బంది పడతాం. దాంతో శరీరానికి తగినంత గా ప్రొటీన్లు, శక్తి అంవ్ఞ. ఫలితంగా చికిత్స పొందుతున్నా అంతగా గుణం కనిపించకపోవచ్చు. దుష్ప్రభావాల ముప్పు పెరగవచ్చు.

అందుకే పోషణలోపం తలెత్తకుండా బాధితులకు అవసరాలకు అనుగుణమైన ఆహారం ఇవ్వటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి ఆహరంతో లభించే ప్రయోజనాల మీద ఇప్పటి వరకూ పెద్దగా అధ్యయనాలు సాగలేదు.

ఈ నేపథ్యంలో పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రి వద్ద లభించే మామూలు ఆహారం తిన్నవారికంటే అవసరాలకు తగిన ఆహారం తీసుకున్నవారిలో చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉండటం విశేషం. దుష్ప్రభావాలు, మరణాలు కూడా తగ్గాయని వెల్లడయింది. తీవ్రమైన జబ్బులతో బాధపడేవారి విషయంలో ఆహార చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వటం ఎంతైనా అవసరమని పరిశోధన ఫలితాలు వివరించాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/