జీహెచ్‌ఎంసీకి భారీ ఆదాయం..

GHMC
GHMC

ఎర్లీ బడ్ స్కీం ఆఫర్ జీహెచ్ఎంసీ ఖజానాను నింపేస్తుంది. ఏప్రిల్ 30 వరకు ఆస్తిపన్ను చెల్లించేవారికి 5 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించడంతో గ్రేటర్ వాసులు భారీగా పన్ను చెల్లించేందుకు క్యూ కడుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ కి భారీగా ఆదాయం వచ్చి చేరుతుంది. ఎర్లీబర్డ్ స్కీం ఆఫర్ కింద ఈ సారి 750 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ.

గత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీకి 741 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఏప్రిల్ 30 లోపు ఒకే సారి చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో 4 రోజుల్లోనే 55 కోట్ల రూపాలయ పన్నుల వసూల్ అయ్యింది. ఒక్క శేరిలింగంపల్లి జోన్ లో అత్యధికంగా 11 కోట్ల రూపాయల ఆస్తిపన్ను చెల్లించారు.