మంత్రి రోజాను హెచ్చరించిన గెటప్ శ్రీను

ఈ మధ్య మంత్రి రోజా నోటికి ఎంతవస్తే అంత మాటనేస్తుందని ఇప్పటికే చాలామంది అనుకుంటుండగా..ఇప్పుడు ఏకంగా చిరంజీవి ఫై దారుణమైన వ్యాఖ్యలు చేసి మరింత వివాదంలో చిక్కుకుంది. ఒకప్పుడు రోజా అంటే అభిమానించే వారు సైతం ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను కూడా ఒకరు.

తాజాగా రోజా మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవి, నాగబాబులను జనం ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని.. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారు కానీ.. వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. ఇక చిరంజీవి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు దత్తపుత్రుడని.. ప్యాకేజీ స్టార్ అని విమర్శలు గుప్పించారు. అయితే ప్రత్యర్ధి కాబట్టి.. పవన్‌ని విమర్శించినా అర్ధం ఉందని.. కానీ చిరంజీవి ఏం చేశారు? ఆయన సేవా గుణం గురించి విమర్శించే అర్హత రోజాకి ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో అభిమానులు ఓ రేంజ్ లో రోజా ఫై మండిపడుతుండగా..జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను సైతం సోషల్ మీడియా లో రోజాను హెచ్చరించారు.

చిరంజీవి గారి సేవా గుణం.. దాన గుణం.. తెరిచిన పుస్తకం.. ఆయన ఒక స్ఫూర్తి.. మరి మీకెందుకు కనపడలేదో ? రోజాగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు.. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ ఇట్టు చిరంజీవి అభిమాని అంటూ పోస్ట్ పెట్టాడు గెటప్ శ్రీను. ఇక చిరంజీవిని ట్యాగ్ చేస్తూ.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ , చిరంజీవి బ్లడ్ బ్యాంక్ , చిరంజీవి హాస్పటల్, సీసీసీ.. హ్యాష్ ట్యాగ్‌లను జోడించాడు.