సుప్రీంకోర్టులో గాలి జనార్దన్రెడ్డికి ఎదరుదెబ్బ
న్యూఢిల్లీ: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి బెయిల్ నిబంధనల సడలింపునకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఎన్నికల తర్వాత మళ్లీ పిటిషన్ వేసేందుకు గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది అనుమతి కోరారు. ఆ విజ్ఞప్తిని కూడా సుప్రీం తిరస్కరించింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్రెడ్డితోపాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబరు 5న జనార్దన్రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.