నా శక్తి నువ్వే నానమ్మ..రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్టు
న్యూఢిల్లీః భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్దంతి సందర్భంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెట్టింట ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. అందులో 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత ఆమె పార్థివదేహం వద్ద రాహుల్ కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటితో పాటు ఇందిరాగాంధీ ప్రజలతో ఇంటరాక్ట్ అయిన దృశ్యాలు, ఐరాస ప్రసంగానికి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో పోస్టు చేసిన రాహుల్.. “నా శక్తి నువ్వే నానమ్మ .. భారత్ కోసం నువ్వు సర్వం త్యాగం చేశావు. ఈ దేశాన్ని నేను ఎప్పటికీ కాపాడుతుంటాను. నీ జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటకీ నాతోనే ఉంటాయి” క్యాప్షన్ జత చేశారు.
మరోవైపు ” ఆదర్శాలను పాటిస్తూ, ధైర్యంగా జీవిస్తూ.. న్యాయం కోసం పోరాటం చేయాలనేందుకు మీ జీవితం నిదర్శనం” అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.