నేడు హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి నేడు సీజేఐ చంద్రచూడ్ శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి (D) బుద్వేల్లో సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్భాటం లేకుండా నిరాబండరంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఓ చారిత్రక భవనానికి పునాదులు వేసేటపుడు ఇంత నిగూఢంగా ఏదో తూతూ మంత్రంగా జరపడం కన్నా ఎన్నికల తర్వాత ప్రముఖులందరి సమక్షంలో నిర్వహించి ఉంటే బాగుండదని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకనాటి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నేటి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాలలో హైకోర్టు నూతన భవన సముదాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే వ్యవసాయ యూనివర్సిటీ భూములను లాక్కోవద్దని విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు, తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈరోజు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమైంది.