రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్న సినీ నటి శోభన..!
తిరువనంతపురం: సినీ నటి శోభన రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు. కేరళ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం లోక్సభ స్థానానికి ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన కేరళలో జరగనున్న బిజెపి కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గోననున్నారు. ఆ రోజున తొలి జాబితాను పార్టీ విడుదల చేయనున్నది. తిరువనంతపురం నియోజకవర్గం ఎంపీ శశిథరూర్ను ఢీకొట్టేందుకు శోభనను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు సురేశ్ కుమార్ కూడా బిజెపి నుంచి పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎక్కువ శాతం మాత్రం నటి శోభనకే ఆ స్థానం నుంచి సీటు దక్కే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల త్రిసూర్లో జరిగిన బిజెపి మహిళా మీట్లోనూ శోభన పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో దిగిన ఓ ఫోటోను కూడా ఆమె పోస్టు చేశారు.