మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో అనేక సార్లు వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచినా ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ చేతిలో ఓటమి చెందారు. శంకర్ నాయక్ ఫై నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత ఉన్నప్పటికీ ..కేసీఆర్ మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చి బోల్తా పడ్డాడు. భూకబ్జాలు , ఉద్యోగులపై ఒత్తిడి..సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం ఇలా చాల వాటిల్లో ఆయనపై వ్యతిరేకత ఉంది..కేసీఆర్ కు సైతం బిఆర్ఎస్ నేతలు శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వద్దని కోరినప్పటికీ కేసీఆర్ మాత్రం మరోసారి ఆయనకే టికెట్ ఇవ్వడం తో ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు.

ఇదిలా ఉంటె ఈరోజు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. “నా కూతురుకి పెళ్లి చేసి అమెరికా పంపిస్తా. నా కొడుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేర్పిస్తా. నాకు 54 సంవత్సరాలు దాటాయి. బతికినకాడికి చాలు. ఇక శంకర్ వేట మొదలైంది. నా సత్తా చూపిస్తా” అని సవాల్ విసిరారు.

“నేను కేసీఆర్ ఒక్కటే కార్తెలో పుట్టాం. నా నియోజకవర్గం కాపాడుకునే సత్తా నాకు ఉంది. నీనేంటో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు. మళ్లీ మీకోసం వస్తా. మనం ఎవరిజోలికి పోవద్దు మన జోలికి ఎవ్వడైన వస్తే వాడిని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవ్వరూ లేరు. ఆపే శక్తి కూడా ఎవ్వడికీ లేదు” అని శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.