పండుగపూట నల్లగొండలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 7 మృతి

పండగపూట నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం ఆయా కుటుంబంలో విషాదం నింపింది. నల్లగొండ జిల్లా పార్వతీపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ ముందు వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కేశవులు, గణ్యా, నాగరాజు, పాండ్యా, బుజ్జిలుగా గుర్తించారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అందరూ పెద్దవూర మండలం మల్యవానికుంటతండా వాసులుగా నిర్ధారించారు.