రత్నప్రభ నామినేషన్ ను తిరస్కరించాలని జనతాదళ్ (యు) ఫిర్యాదు
రిటర్నింగ్ అధికారికి జనతాదళ్ (యు) నేత రమణ లేఖ
Nellore: తిరుపతి ఉప ఎన్నిక కు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ను తిరస్కరించాలని జనతాదళ్ -యు నేత ఎవి రమణ , రిటర్నింగ్ అధికారికి లేఖ అందించారు.. నామినేషన్ పత్రాల్లో రత్న ప్రభ తనపై ఎటువంటి కేసులు లేవని పేర్కొన్నారని, హైదరాబాద్ లోని బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుపాడు పోలీస్స్టేషన్లలో ఆమెపై 5 కేసులు పెండింగ్లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అధికారికి సమర్పించారు. కుల ధృవీకరణ పత్రాలకి రికార్డులు లేవని, స్కిల్ డెవలెప్ మెంట్ ఛైర్మన్గా పనిచేస్తూ, పెన్షన్పై జీవిస్తున్నట్టు తెలిపారని ఆరోపించారు. వెంటనే రికార్డులు పరిశీలించి ఆమె నామినేషన్ తిరస్కరించాలని కోరారు..
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/