ప్రధాని మోడీ పర్యటన..కెసిఆర్ కు అందిన ఆహ్వానం..

ఇటీవలి కాలంలో కేంద్రంపై విమర్శలు తగ్గించిన కెసిఆర్

will-kcr-attend-modi-program

హైదరాబాద్‌ః ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్ లో రూ. 6,100 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మోడీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం అందింది. అయితే ఆయన హాజరవుతారా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. 2021 సెప్టెంబర్ వరకు మోడీతో, కేంద్ర ప్రభుత్వంతో కెసిఆర్ సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా బిజెపి, బిఆర్ఎస్ మధ్య తేడాలు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.

ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణకు మోడీ పలుమార్లు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం కెసిఆర్ ను ఆహ్వానించినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా హాజరుకాలేదు. అన్ని సందర్భాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి ఆహ్వానం పలికి, వీడ్కోలు పలికేవారు. అయితే గత కొంత కాలంగా బిజెపిపై కెసిఆర్ విమర్శలు తగ్గించారు. దీంతో, మోడీ పర్యటనకు కెసిఆర్ హాజరవుతారా? అనే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.