ప్రతి ఓటు లెక్కలోకి వస్తుంది.. మీ ఓటును కూడా విలువైంది: ప్రధాని మోడీ
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/02/pm-modi-praises-nris-before-leaving-for-uae-tour-jpg.webp)
న్యూఢిల్లీ: ఈరోజు ఆరో విడుత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. ప్రతి ఓటు విలువైనదని, మీ ఓటును కూడా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల సరళిలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని మోడీ తెలిపారు. ఎక్స్ అకౌంట్లో ఆయన మెసేజ్ చేశారు. ఆరో దశ ఎన్నికల్లో ఓటు వేస్తున్న వారు భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు తరలిరావాలన్నారు. ప్రతి ఓటు లెక్కలోకి వస్తుందని, మీ ఓటును కూడా విలువైందన్నారు. మహిళా ఓటర్లు, యువత భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొవాలని ఆయన కోరారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని ఏడు సీట్లకు కూడా ఇవాళే ఓటింగ్ జరుగుతోంది.