బిజెపి పార్టీకి రాజీనామా చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరుతుండగా..ఈరోజు మాజీ ఎంపీ వివేక్..బిజెపి కి రాజీనామా చేసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరగా..తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి రాజీనామా చేసారు.
వరంగల్ వెస్ట్ నుంచి టికెట్ ఆశించిన రాకేశ్ రెడ్డి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. వరంగల్ వెస్ట్ టికెట్ను రావు పద్మకు కేటాయించింది బీజేపీ. అయితే టికెట్ విషయంలో తనను మాట మాత్రం సంప్రదించలేదని, టికెట్ ప్రకటించిన తర్వాత కూడా తనకు ఏ ఒక్కరూ ఫోన్ చేసి మాట్లాడలేదని ఆవేదనకు లోనయ్యారు. వరంగల్ జిల్లాలో బీజేపీకి కార్యకర్తలను తయారు చేశానని భావోద్వేగానికి లోనయ్యారు. ఎంత అవమానించిన ఏనాడు అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పుకొచ్చారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు రాకేష్ రెడ్డి. ఇండిపెండెంట్గా బరిలోకి దిగేది త్వరలోనే స్పష్టం చేస్తానన్నారు.