బిజెపిలో చేరిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
హైదరాబాద్ః తెలంగాణలో నేతల పార్టీ మార్పులు కొనసాగుతున్నాయి. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బిఆర్ఎస్కు రాజీనామా చేసి, బిజెపిలో చేరారు. కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్లో టిక్కెట్ దక్కకపోవడంతో రాథోడ్ బాపురావు కమలం పార్టీలో చేరారు.
మరోవైపు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఉప్పల్ టిక్కెట్ హామీతో ఆయన బిజెపిలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈరోజు బీజేపీ మూడో జాబితా రానుంది. ఉప్పల్ టిక్కెట్నుబిజెపి ఎవరికీ కేటాయించలేదు. ఈ రోజు విడుదలయ్యే మూడో జాబితాలో ఉప్పల్ నుంచి భేతి సుభాష్ రెడ్డి పేరు ప్రకటించవచ్చునని తెలుస్తోంది.