ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మరో షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఈరోజు ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు నిర్వహిస్తున్నారు. కవిత భర్త బంధువుల ఇళ్ళలో ఈడీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. మాదాపూర్ లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తును కోర్టు పరిశీలించనుంది. కాగా కవితను ఈ నెల 15న ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ఈరోజు కోర్ట్ లో హాజరు పరచనున్న తరుణంలో కవిత కు బెయిల్ వస్తుందా..? లేక మరోసారి ఈడీ కస్టడీకి పంపిస్తారా..? అని అంత టెన్షన్ పడుతున్నారు. మరోపక్క ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాలాను కూడా అరెస్ట్ చేయడంతో ఇద్దర్ని కలిపి విచారణ చేయాలనీ..దీనికి గాను అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్ట్ ను కోరుతున్నారు. మరి కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.