నిహారిక -చైతన్య లకు విడాకులు మంజూరు చేసిన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు

గత కొద్దీ రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతుండగా…వాటిపై మెగా ఫ్యామిలీలో ఎవరు స్పందించలేదు. కానీ ఇది నిజమే అని తేలింది. నాగబాబు కుమార్తె నిహారిక, ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఐజీ ప్రభాకర్ కొడుకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జొన్నలగడ్డ చైతన్యకు 2020 డిసెంబర్ 9న వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ సాంప్రదాయబద్దంగా ఇరు కుటుంబాలు పెళ్లి జరిపించాయి. కొన్నాళ్లు సక్రమంగానే సాగిన వీరిద్దరి కాపురంలో.. క్రమంగా కలహాలు మొదలయ్యాయి. వీరిద్దరినీ కలపడానికి రెండు కుటుంబాల్లోని పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, అది సాధ్య పడలేదు.

గత కొద్ది రోజులుగా నిహారిక తన భర్త చైతన్య నుంచి దూరంగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఇన్స్టాగ్రామ్ లో ఒకరి ఫోటోలను ఒకరు డిలీట్ చేసుకోవడం, పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఇక ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వినిపించాయి. మరొకవైపు నిహారిక ప్రతి విషయాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ సింగిల్గానే పోస్ట్లు పెడుతోంది. కానీ తన భర్తకు సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆమె షేర్ చేయలేదు. దీంతో అందరు వీరి విడాకుల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇన్నాళ్లూ వీరిద్దరి విడాకులపై ఇరు కుటుంబాలు స్పందించలేదు. అయితే మే 19నే కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్డులో ఇరువురు విడాకుల కోసం అప్లై చేశారు. జూన్‌లోనే పరస్పర అంగీకారం మేరకు కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా వెలుగు చూశాయి. దీంతో మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు నిజమని స్పష్టమైంది. ప్రస్తుతం నిహారిక సినిమాల ఫై ఫోకస్ చేసింది.