కాసేపట్లో పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు జిల్లాలో నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజాదీవెన సభ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరుకానున్న తొలిసభ కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.

లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయాలు జోరుందుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ అనుకుంటుంది. ఎన్నికల్లో భాగంగానే పార్లమెంట్ పరిధిలో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో వంశీచంద్ రెడ్డి పర్యటన పూర్తి చేసుకున్నారు. అటు జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రజా దీవెన సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.