రాణా కపూర్ వ్యవహారం..చిక్కుల్లో ప్రియాంక గాంధీ?
ప్రియాంక గాంధీని ప్రశ్నించనున్న ఈడీ?

న్యూఢిల్లీ: ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ను రెండు కోట్లకు పెయింటింగ్ విక్రయించిన విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ప్రియాంక నుంచి ఈ పెయింటింగ్ను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మిలింద్ దేవరా తనపై ఒత్తిడి తెచ్చారని ఈడీకి రాణా కపూర్ వాంగ్మూలం ఇచ్చారు. పెయింటింగ్ కోసం తాను ఇచ్చిన రెండు కోట్లతో ప్రియాంక సిమ్లాలో కాటేజ్ కొనుగోలు చేసిందని చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఓ కేసులో నిందితుడి నుంచి తీసుకున్న డబ్బుతో ప్రియాంక కొనుగోలు చేసిన కాటేజ్ను ఖనేరం ద్వారా వచ్చిన ఆదాయంగగా పరిగణించాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆస్తిని తమ అధీనంలోకి తీసుకునే అధికారం ఈడీకి ఉంటుందని అంటున్నారు. కపూర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రియాంకకు త్వరలోనే సమన్లు జారీ చేయడంతో పాటు సిమ్లాలోని కాటేజ్ను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రియాంక నుంచి రాణా కపూర్ కొనుగోలు చేసిన పెయింటింగ్ను సీజ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ (ఈజీ) అధికారులు ప్రకటించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండిhttps://www.vaartha.com/news/sports/